వనపర్తి: గిరిజన తండాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగా ణ ప్రభుత్వానిదేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటి పరిధిలోని 8వ వార్డు బిజినగడ్డ తండాలో రూ 12లక్షల తో నూతనంగా నిర్మించిన గిరిజన కమ్యూనిటి హాల్ను గిరిజన మహిళ, అదన పు కలెక్టర్ అంకిత్తో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు అంకితభావంతో పనిచేస్తున్నదని గుర్తు చేశారు.
తండాలోని ప్రజలు వారి తండా లను వారే అభివృద్ధి చేసుకునే దిశగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి నేరుగా వారి గ్రామ పంచా యతీ ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేస్తున్నదని, ఈ నిధులతో తండాల్లో కావాల్సిన సౌకర్యాల ను కల్పించుకుంటున్నారని మంత్రి వివ రించారు. కమ్యూనిటీ హాల్లో గిరిజనులందరూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకు ని తండా, ప్రజల అభివృద్ధికి కావాల్సిన వాటి గురించి క్షుణ్ణంగా చర్చించుకున్నప్పుడే ఏం అభివృద్ధి చేసుకోవాలన్నది తెలుస్తుందన్నారు.
అంతకుముందు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల, గ్రామాల,పట్టణాలకు చెందిన భాదితులకు సీఎం సహాయని ధి నుంచి విడుదలైన చెక్కులను మంత్రి నిరంజన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆయా నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి టిఫిన్ చేశారు. ఎంతో మంది బాధితులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మున్సిపల్ మాజి చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్లు లక్ష్మీనారా యణ, విభూతినారాయణ, పాకనాటి కృష్ణయ్య, పుట్టపాకుల మహేశ్, చీర్లసత్యం తదితర కౌన్సిల ర్లు, ఆయా మండలాల,గ్రామాల, పట్టణాల నాయకులు, బాధితులు తదితరులు పాల్గొన్నారు.