వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎస్పీ నివాస గృహానికి భూమిని కేటాయించి నిర్మాణం గురించి ప్రభుత్వం తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ 2 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నివాస గృహాన్నిరెండు ఫ్లోర్లు నిర్మించారని రానున్న శతాబ్ది కాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పోలీసు పరిపాలన సం బంధిత భవనాలు ఉండాలన్నాదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో నూతనంగా నిర్మించిన ఎస్పీ నివాస గృహాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వరావులతో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో సీఎం కెసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగానే నివాస భవనాలను రాష్ట్రంలోని అన్న కమిషనరేట్లు, జిల్లాలలో నిర్మించాలని సీఎం ఆదేశాల మేరకు వీటి నిర్మాణం చేపట్టిందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ భవనం సమీపంలో నిర్మించిన ఎస్పీ నివాస గృహం అత్యంత ఆధునిక ప్రమాణాలతో నూతన హంగు లతో నిర్మించారని, వెనుక భాగంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నివాసం ఉండేందుకు అధునాతన భవనాన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వరావులు, సిబ్బంది మంత్రి నిరంజన్ రెడ్డిని పూలబొకే లతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్కుమార్, కార్యాలయ ఏవో రుక్మిణీ భాయి, పోలీసు హౌసింగ్ డీఈ బాలాజీదాసు, ఏఈ అనీల్, సీఐలు ప్రవీణ్కుమార్, మల్లిఖార్జున్ రెడ్డి, సీత య్య సాయుధ దళాల ఇన్ స్పెక్టర్ జగన్, ఎస్ఐలు మధుసూదన్, మల్లేశ్, షేక్ షఫీ, రాజు, వెంకటేవ్గౌడ్, రామస్వామి, నాగన్న, రాము, పీఆర్వో రాజాగౌడ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.