వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరిని నూతన ఓటరుగా నమోదు కావాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో శశంక్గోయల్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరిని ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా 2022 ఓటర్ జాబితా సిద్ధం చేయాలని, కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు సమర్పించిన ఫారాలు, మార్పులు , చేర్పులకు సంబంధించిన ఫారాలను పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ఓటర్కు అందజేయాలని, చనిపోయిన వారి వివరాలను ఓటర్ జాబితా నుంచి తొలగించా లని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ 330 ఫారాలు పెండింగ్లో ఉన్నాయని ఒక వారం రోజుల లోపు వాటిని క్లియర్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.