వనపర్తి టౌన్: వనపర్తి జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం న్యాక్ బృందం సందర్శించింది. ముందుగా మంగళ వాయిద్యాలతో న్యాక్ బృందా న్ని ప్రిన్సిపల్ సురేశ్ ఆహ్వానించగా సభ్యులందరూ కళాశాలలను పరిశీలించారు. అందులో అధ్యాపకుల బోధన విదానం, కళాశాలలోని మౌలిక సదుపాయాలు, సాంకేతిక బోధన, అధ్యాపకులు పనితీరు, రికార్డుల నిర్వహణ, కళాశాల వాతావరణం, కళాశాలలోని ల్యాబ్ల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదిత ర ఆంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ పరీక్ష అనంతరం కళాశాలకు గ్రేడ్లను అందజేయనున్నారు. గ్రేడ్ల ఆధారంగా యూజీసీ నిబంధనల మేరకు నిధుల కేటా యింపు జరుగనున్నది, ఈ తీరి గ్రూపులో పాట్నా యునివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రంజిత్ కె.వర్మ చైర్మన్గా, అస్సాం యునివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జ్యోతి భట్టాచార్య, గోవాకు చెందిన ఎస్డీఈసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రీతం మాల్యా, సీసీఈ జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్లు హాజరయ్యారు.
అనంతరం సాయంత్రం తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే బతుకమ్మ, కోలాటాలు, బొడ్డెమ్మ, తెలంగాణ జాన పదం, గ్రామీణ ఆటపాటలతో సాంసృతి క కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేశ్, కో-ఆర్డినేటర్ కృష్ణమూర్తి, అధ్యాపకులు వెంకట్ప్రసాద్, అత్తమ్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శ్రీనివాస్, పుష్ప పాల్గొన్నారు.