వనపర్తి: జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న పోలీసు కార్యాలయాల సముదాయ నిర్మాణ పను లను జిల్లా ఎస్పీ అపూర్వరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు నూతన కార్యాలయ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్పీ హౌసింగ్ అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.
ఇప్పటి వరకు జరిగిన నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. నూతన పోలీసు కార్యాలయ ఆవరణలో మిగిలిన చిన్న చిన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎస్పీ వెంట ఏఈ అనిల్శాస్త్రి, కాంట్రా క్టర్ సుబ్బారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.