గోపాల్పేట: 18 సంవత్సరాలు పైబడిన వారంతా తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి చందునాయక్ అన్నారు. మండలంలోని తాడిపర్తి చెన్నూరు గ్రామాల్లో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ సెంట ర్లను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే సెంటర్కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
వాక్సిన్ పట్ల అపోహలు లేకుండా అవగాహన కలిగించాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో వంద శాతం వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరుణశ్రీ, డాక్టర్ మంజుల, సర్పంచ్లు పద్మమ్మ, శేషిరెడ్డి, వైద్య సిబ్బంది సాయిరెడ్డి, సురేశ్ కుమార్, మహేశ్వర ఆచారి, శోభారాణి, లక్ష్మి, అంగన్ వాడీలు, ఆశలు పాల్గొన్నారు.