వనపర్తి, జనవరి 24 : ప్రజలకు ఓటు హక్కు వ జ్రాయుధం లాంటిది. ఎన్నికల నిర్వహణకు రా జ్యాంగం కల్పించిన విధానం ఓటు హక్కు. ఓటు అనే ది ఓటన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓటు అంటే తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి, మద్ద తు తెలపడం, అంగీకారం, వాగ్ధ్దానం, ఎన్నుకోవడం అని అర్థం. రాజకీయ ప్రక్రియలో యువకులను భాగస్వాములు చేసేందుకు వీలుగా ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2011లో నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో 18 ఏండ్లు నిండిన యు వతీయువకులను గుర్తించే కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ప్రతి ఏటా పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు జనవరి 25 నాటికి ఫొటో గుర్తింపు కార్డులిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. 1950 జనవ రి 25వ తేదీన భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. దానిని స్పురణకు తెచ్చేలా.. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. దేశ భవిష్యత్ను ప్రజాప్రతినిధుల చేతిలో పెట్టేది ఓటర్లే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్ కీలక పాత్ర వహిస్తున్నది. ఏ రాజకీయ పక్షానికి తలవంచకుండా స్వతంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నది. కేంద్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం.., రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా స్థానిక అధికారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఓటు పుట్టుక..
క్రీ.పూ.139 నుంచి ఓటు హక్కు వినియోగం ఉన్నట్లు చరిత్ర ప్ర కారం తెలుస్తున్నది. పురాతన గ్రీక్ దేశంలో పగిలిన మట్టి పాత్ర ముక్కలను ఓట్లుగా గుర్తించేవారు. ప్రాచీ న భారతదేశంలో క్రీ.శ.320లో తమిళనాడులో అర టి ఆకుల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఈ పద్ధతిని వొలూ వ్యవస్థ అని పిలిచేవారు. ప్రపంచదేశాల కు ఆదర్శంగా అమెరికాలో మొదటిసారి కాగితపు బ్యాలెట్లతో చర్జి పాస్టర్ ఎన్నిక కోసం వినియోగించా రు. ఆయాదేశాల్లో రాజ్యాంగాల పరిపాలనా విధానానికి అనుగుణంగా ఓటు హక్కుతోనే వార్డుమెంబర్లు నుంచి రాష్ట్రపతి వరకు ఎన్నుకుంటున్నారు. భారతదేశంలో 1952 సార్వత్రిక వయోజన ఓటు హక్కు వి నియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు. కాలానికి అనుగుణంగా ప్రధాన ఎ న్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలను వినియోగిస్తున్నారు.
ఓటు హక్కు నమోదు ఇలా..
ఓటు హక్కు నమోదుకు సంబంధించి రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా పొందిన పత్రాలను మండల రెవె న్యూ కార్యాలయంలో అందజేయాలి. పత్రాలను వెరి ఫై చేసి 15 రోజుల్లో ఓటర్ గుర్తింపు కార్డును పోస్టు ద్వారా పంపిస్తారు. మీ సేవా కేంద్రాల్లో కూడా కార్డు ను పొందొచ్చు. వనపర్తి నియోజకవర్గంలో 290 పో లింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,46,297 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,23,873 పురుషులు, 1,22,422 స్త్రీలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు.