వనపర్తి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలో తెలివిలేని సర్కార్ దేశాన్ని ఏలుతున్నదని, రైతుల మీద వారికి ఏ మాత్రం ప్రే మలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. వనపర్తి నియోజకవర్గంలో మంగళవారం రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్రమోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మన వద్ద అమలవుతున్న ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు లేవని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నదాతకు ఆత్మవిశ్వాసం పెరిగిందని, వారి చెమట చు క్కలకు సరైన గౌరవం లభిస్తున్నదన్నారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రభుత్వమూ రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోలేదన్నారు. కా నీ, స్వరాష్ట్రంలో వలసవెళ్లిన రైతులు స్వగ్రామాలకు వచ్చి పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. ఇదంతా టీఆర్ఎస్ స ర్కార్ పుణ్యమేనన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ‘రైతే రా జు’ అనేది పార్టీలకు నినాదంగా మారిందని.., కానీ సీఎం కేసీఆర్కు మాత్రం వ్యవసాయం విధానంగా మారిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం వంటి బృహత్తరమైన ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించి సీఎం కేసీఆర్ ప్రపంచ రికార్డు సృష్టించారని.., 23 నెలల్లో ఏదుల రిజర్వాయర్ నిర్మించడం దేశంలోనే మరో రికార్డు అని వెల్లడించారు. జర్మనీలో మాత్రం రసాయనాలు తక్కువగా వాడిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు. అధికంగా వాడినట్లు తేలితే భారీ జరిమా నా విధిస్తారన్నారు.
ఎక్కడా లేనివిధంగా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ట్లు చెప్పారు. మరే దేశంలోనూ ఇలాంటి పథకాలు అమలుకావడం లేదన్నారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడే పార్టీ నాయకులు అన్నదాతల మేలు కోరలేదన్నారు. పెట్టుబడి కోసం అప్పుల పాలవుతున్న రైతులకు మేలు చేయాలన్న సీఎం కేసీఆర్ మస్తిష్కం నుంచి పుట్టిందన్నారు. రైతుబంధు ఎన్నికల పథకమని కొందరు నాయకులు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎనిమిది విడుతలు గా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.50,600 కోట్లు జమ చేశామన్నారు. ఇప్పటివరకు ఏడెకరాలలోపు ఉన్న 60.16 లక్షల మంది ఖాతాల్లో రూ.6,008 కోట్లు జమచేశామని, మిగతా వారందరికీ ఒ కటి, రెండు రోజుల్లో పెట్టుబడి సాయం అందుతుందన్నారు. రై తులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా సంబురాలు చేసుకుంటున్నారన్నారు. తె లంగాణ రాకముందు కేవలం 32 లక్షల ఎకరాలున్న వ రిసాగు.. గతేడాది కోటి 6 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. మట్టిని నమ్ముకున్న రైతు ఎన్నటికీ చెడిపోడన్నారు. దేశంలో ఎఫ్సీఐ సేకరించిన ధా న్యంలో 54 శాతం తెలంగాణదేనన్నారు. ఆ ఖరుకు తెలంగాణ నుంచి వడ్లు కొనలేమ ని బీజేపీ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. ఎగుమతులు చేయకుండా గోదాంలు లేవని చెప్పడం దారుణమన్నారు. దీనిపై రాష్ట్రంలో, దేశంలో చర్చ జరగాలన్నారు.
వనపర్తికి వన్నె తెస్తా..
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వనపర్తికి, వ్యవసాయ శాఖకు వన్నెతెచ్చే ప్రయత్నం చేస్తున్నానని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 1.15 లక్షల ఎకరాలకు సాగునీ రు అందుతున్నదన్నారు. 60 ఎత్తిపోతలు నిరంతరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. 600 పడకల మెడికల్ కళాశాల వచ్చిందని, వై ద్యానికి నిమ్స్, గాంధీ వంటి దవాఖానలకు వెళ్లాల్సిన అవస రం లేదన్నారు. కొద్ది రోజుల కిందట జేఎన్టీయూ ప్రభు త్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరైందన్నారు. రాష్ట్రంలోని టాప్ ఐదు జిల్లాల్లో వనపర్తి ఒకటిగా నిలిచేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, మండలాధ్యక్షుడు న ర్సింహ, సర్చంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మున్సిప ల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, వనపర్తి పట్టణ టీ ఆర్ఎస్ అధ్యక్షుడు ర మేశ్గౌడ్, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు ఉన్నా రు.