వనపర్తి, జూలై 3 : ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో పట్టణాన్ని కూడా అదే తరహాలో పరిశుభ్రంగా ఉం చుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో కౌన్సిలర్ భువనేశ్వరి, ప్రత్యేకాధికారి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డిలతో కలిసి శానిటేషన్ను పరిశీలించారు. 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ పార్వతమ్మ వార్డు ప్రజలతో కలిసి మొక్కలను నాటడంతోపాటు వార్డు మొత్తం శుభ్రం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కృష్ణ, కృష్ణయ్య, నారాయణ, నాగన్నయాదవ్, రాధాకృష్ణ, నాయకులు శ్యాం, యుగంధర్రెడ్డి ఉన్నారు.
పెబ్బేరులో..
పెబ్బేరు, జూలై 3 : పట్టణ ప్రగతితోనే మున్సిపాలిటీ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ ప్రత్యేకాధికారి రవీందర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్చైర్మన్ కర్రెస్వామిలతో కలిసి పట్టణంలోని వివిధ వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే 12వ వార్డులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ క మిషనర్ జాన్కృపాకర్, ఏఈ రమేశ్నాయుడు, కౌన్సిలర్లు ఎల్లారెడ్డి, నాయకులు సాయినాథ్, ఎల్లయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
శ్రీరంగాపూర్లో..
శ్రీరంగాపూర్, జూలై 3 : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జాకీర్హుస్సేన్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. శ్రీరంగాపూర్ మండలం జానంపేట, నాగరాల గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దళితవాడలో మౌలిక వసతులు కల్పించడం కోసం సర్పంచ్ల ఆధ్వర్యంలో అధికారులు సర్వే నిర్వహించారు. నాగరాల గ్రామం ఆర్అండ్ఆర్ సెంటర్లో మిషన్ భగీరథ నీళ్ల కోసం మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎ స్ అధికారులు పరిశీలించారు. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్, ట్యాంక్లను పరిశీలించిన అధికారులు ఐదు రో జుల్లో ప్రతి ఇంటికి నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్, సర్పంచ్లు నిర్మల రాధాకృష్ణ, వెంకటేశ్వర్రెడ్డి, డీఈ అమిత్కుమార్, ఏఈ రవితేజ ఉన్నారు.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, జూలై 3 : ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామ ంగా తీర్చిదిద్దుకోవాలని మండల ప్రత్యేకాధికారి వెంకట్రె డ్డి అన్నారు. శనివారం మండలంలోని మల్కిమియాన్పల్లి, తిరుమలాయపల్లి గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స మన్వయంతో పనిచేసి గ్రామాలను స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అదేవిధంగా 7వ విడుత హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. తిరుమలాయపల్లి గ్రామంలో బాస్కో సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనాపై నిర్వహించిన అవగాహన క్యాంపునకు ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో, బాస్కో సేవా సమితి డైరెక్టర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, జూలై 3 : మొక్కలు నాటి సంరక్షిద్దామని రామకిష్టాపురం సింగిల్విండో చైర్మన్ వాసుదేవరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పామాపురం గ్రామంలో సొసైటీ కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడో విడుత హరితహారంలో మొక్కలు విరివిగా నాటాలన్నారు. కొత్తకోట పట్టణంలోని 6వ వార్డులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను ఆ వార్డు కౌన్సిలర్ సంధ్య రవీందర్ తొలగించారు. వార్డులో రోడ్లను శుభ్రపరిచి డ్రైనేజీలో పూడికను తీశారు. మూడో వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ పారుశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. 2వ వార్డులో కౌన్సిలర్ రాములుయాదవ్ డ్రైనేజీలోని పూడికను తీసివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో రాఘవేందర్రెడ్డి, సిబ్బంది సురేశ్, శ్రీను, గ్రామస్తులు హేమసుందర్రెడ్డి, వెంకటన్న, రాములు పాల్గొన్నారు.
పెద్దమందడిలో..
పెద్దమందడి, జూలై 3 : హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సర్పంచ్ జయంతి అన్నారు. శనివారం మండలంలోని బలిజపల్లి గ్రామంలో 7వ విడుత హరితహారంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ గ్రామంలో అనువైన ప్రతిచోట మొ క్కలు నాటి, ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వనపర్తి మండలంలో..
వనపర్తిరూరల్, జూలై 3 : మండలంలోని పల్లెప్రగతి కార్యక్రమాలను శనివారం ఎంపీడీవో రఫీఖ్ ఉన్నీసా బేగం సం దర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలను నాటించాలన్నారు.