కొత్తకోట, ఏప్రిల్ 10 : దేశంలో, రాష్ట్రంలో కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందేశ్యాత్రలో భాగంగా శనివారం మండలంలోని కనిమెట్ట, పాలెం గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్, జ్యోతిరావుఫూలే సూచించిన విధంగా కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఈ నెల 14న జిల్లా కేంద్రంలో నీలి దండు కవాతు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కృష్ణ, వెంకటేశ్, రాము, ఎర్రరాజు, రాములు, శంకర్, నారాయణ, సుధాకర్, శ్రీనివాసులు, వెంకటయ్య, ప్రవీణ్, సాయన్న, శంకర్, వెంకటస్వామి ఉన్నారు.