కొత్తకోట, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తున్న వారికి నెల నెలా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ శనివారం వినతిపత్రం అందజేశారు. ఇటీవల ప్రముఖ గాయకుడు సాయిచంద్ సోదరుడు క్రాంతి మృతి చెందగా దశదిన కర్మకు వెళ్తుండగా మంత్రి హరీశ్రావు కొత్తకోట చౌరస్తాలో ఆగారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ, కౌన్సిలర్లు కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో నిధులు విరివిగా ఉన్నప్పటికీ కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నదని విన్నవించారు.
ఈ విషయంపై ఆర్థిక శాఖ కార్యదర్శికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సానుకూలంగా స్పంది ంచిన మంత్రి ముఖ్య కార్యదర్శితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిలర్లు రాములుయాదవ్, కొండారెడ్డి, రామ్మోహన్రెడ్డి, తిరుపతయ్య, ఖాజామైనొద్దీన్, సంధ్య, మహేశ్వరి, అయ్యన్న, పద్మ, రవీందర్రెడ్డి, కోఆప్షన్సభ్యులు వసీంఖాన్, వహిద్, శ్రీను, డాక్టర్ సాజద్అలీ, సుభాష్, వినోద్, శ్రీనుజీ పాల్గొన్నారు.