వనపర్తి, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : వనప ర్తి జిల్లా వాసులకు కార్పొరేట్ వైద్యం అందనున్నది. పెద్ద రోగం వస్తే హైదరాబాద్లోని గాంధీ, ఉస్మాని యా, నిమ్స్ దవాఖానలకు వెళ్లకుండా స్థానికంగానే పూర్తి స్థాయి వైద్యం అందేలా ప్రభుత్వం సౌకర్యాలు సమకూరుస్తున్నది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో వనపర్తి మెడికల్ హబ్గా మారుతున్నది. కనీస సౌకర్యాలు లేని జిల్లా దవాఖానను 180 పడకలుగా అప్గ్రేడ్ చేశారు. సకల సౌకర్యాలతో అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవా ల సంఖ్య పెంచడంతోపాటు మాతా శిశు సంరక్షణ కేం ద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి 100 పడకల మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్)ను నిర్మించారు. అదనంగా మరో 80 పడకలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఈ దవాఖానను మంగళవా రం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే 20 పడకలతో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా, నర్సింగ్ కళాశాల, రూ.710 కోట్ల నిధులతో 600 పడకలతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు కొ నసాగుతున్నాయి. మెడికల్, నర్సింగ్ కళాశాలల్లో వ చ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. వీటిని ఎప్పటికప్పుడు మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి మంత్రి నిరంజన్రెడ్డి జిల్లాకు కళాశాలలను తీసుకురావడంతో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వైద్య సిబ్బంది, విద్యార్థులు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. గుండె జబ్బు వంటి అరుదైన శస్త్ర చికిత్సల కు కూడా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు.
రూ.17 కోట్లతో ఎంసీహెచ్..
మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రూ.17 కోట్లతో ని ర్మించారు. ఈ దవాఖానను ప్రసవాల కోసం వినియోగించనున్నారు. నవజాత శిశు సంక్షేమ కేంద్రానికి రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి ప్రభుత్వం రూ.45 లక్షలు కేటాయించింది. వీ టికి అనుసంధానంగా ఉన్న అప్రోచ్ సీసీ రోడ్డు, పేషెం ట్ అటెండెంట్, పార్కింగ్ షెడ్లకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
నేడు పాలియేటివ్ కేర్ ప్రారంభం
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. ఎవరూ లేని వ్యక్తులకు బాధ నుంచి ఉపశమనం, జీవన నాణ్యతను మెరుగునకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆరు పడకలతో పాలియేటివ్ కేర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ ఉదయ్కుమార్ పరిశీలించారు. అనంతరం వైద్యులతో మౌలిక సదుపాయాలపై చర్చించారు. అలాగే కొల్లాపూర్లో నిర్మించిన ఎంసీహెచ్ భవనాన్ని ప్రా రంభించనున్నారు. కలెక్టర్ వెంట జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ శివరాం, రోహిత్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఉన్నారు.
అధికారులతో సమావేశం..
మంతటి గడ్డ తేజ కన్వెన్షన్ హాల్లో వనపర్తి, నాగర్కర్నూల్ కలెక్టర్లు, అధికారుల తో మంత్రి హరీశ్రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో సుధాకర్లాల్ ప్రకటనలో తె లిపారు. నాగర్కర్నూల్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. కలెక్టర్ ఉదయ్ సూచనల మే రకు మార్చినట్లు పేర్కొన్నారు.