కోస్గి, మే 30 : ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించినా, విక్రయించి పట్టుబడినా కఠినచర్యలు తప్పవని సీఐ రాంలాల్, ఎస్సై నరేందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. ప్రభుత్వ గుర్తింపు కలిగిన లేబుల్గల వాటిని పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయించి అమాయక రైతులను మోసంచేస్తూ వారిని శ్రమదోపిడీకి గురిచేస్తే సహించబోమన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు నకిలీ విత్తనవ్యాపారులపై పీడీ చట్టంకింద కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామన్నారు. పొలంలో విత్తనం నాటే మొదలు పంట చేతికొచ్చేవరకు పెట్టుబడిపెట్టి నేలతల్లిని నమ్ముకునే రైతును మోసంచేయడం సబబు కాదని ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.
విత్తన విక్రయాలపై తనిఖీ
దామరగిద్ద, మే 30 : విత్తన విక్రయాలపై ఎస్సై గోవర్ధ్దన్, వ్యవసాయ విస్తరణ అధికారి గోపాల్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలం సీజన్ మొదలు అవుతుండటంతో రైతులకు నకిలీల బెడద తప్పంచడానికి విత్తనాలు అమ్మే దుకాణాల్లో తనఖీలు నిర్వహించామని, మండలంలోని రైతు ఆగ్రోస్ కేంద్రాలతోపాటు, వివిధ ఎరువుల దుకాణాల తనఖీలో భాగంగా నకిలీ విత్తనాలతోపాటు, ఎరువులు వాటి లేబుల్స్, లాట్ నెంబర్, బ్యాచ్ నెంబర్, ఇన్వాయీస్, విత్తన విక్రయాల అనుమతులు, లైసెన్స్ అన్ని పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు కానిస్టేబుల్ వీవీగిరి, మల్లన్న పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణం పరిశీలన
నారాయణపేట రూరల్, మే 30 : మండలంలోని సింగా రం చౌరస్తా వద్ద గల ఎరువుల దుకాణాన్ని ఆదివారం పేట ఎస్సై సైదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ దుకాణంలో ఏఏ రకాల విత్తనాలు, ఎరువులు ఉన్నాయని పరిశీలించారు. దుకాణాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరం గా చర్యలు తీసుకొంటామన్నారు. రైతులను మోసం చేయకుండా నాణ్యమైన విత్తనాలను అమ్మాలని లేకుంటే చట్ట ప రంగా కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.