ఊట్కూర్, మే 29 : లాక్డౌన్ అమలుతోనే ప్రజలకు మేలు జరుగుందని ఎస్సై రవి అన్నారు. శనివారం గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్ అమలును ఆయన పర్యవేక్షించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో కేసులు తగ్గుతున్నట్లు వివరించారు. లాక్డౌన్కు ప్రజలు సైతం సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మండలకేంద్రంలో చెక్పోస్టు వద్ద ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను గ్రామాలకు తిప్పి పంపించారు.
లాక్డౌన్లో పోలీసులకు సహాయం
మక్తల్ టౌన్, మే 29: లాక్ డౌన్లో నిర్విరామంగా సేవచేసే పోలీసులకు తమ వంతుగా సహాయం అందిస్తామని రాజస్థాన్ సేవా సమితి సభ్యులు తెలిపారు. శనివారం మక్తల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో రాజస్థాన్ సేవా సమితి ఆధ్వర్యంలో రాజస్థాన్ సేవా సమితి సభ్యులు పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మక్తల్ పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో, బస్టాండ్లో బాటసారులకు, అనాథలకు, లారీ డ్రైవర్లకు దామోదర్ రమేశ్, నర్సిములు (అచ్చప్ప)అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. పూల వ్యాపారం చేసే రాము లాక్డౌన్ను పకడ్బందీగా నిర్వహించే పోలీసులకు ప్రతిరోజు శర్బత్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా రామును పోలీసులు అభినందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పేదవారి కడుపు నింపడం ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో పోలీసులు నిర్విరామంగా ప్రజల కోసం బందోబస్తు నిర్వహిస్తున్నారని అలాంటి వారికోసం తమ వంతుగా సహాయం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాములు ,హనుమాన్ సింగ్,థాన్ సింగ్, జగదీష్,నర్సిములు, దాస్, రామ్, జటూ, బేరా, సోన్, వెంకటేశ్, అశోక్,సత్య యాదవ్, వీబీ వెంకటేశ్ తదితర పోలీసులు పాల్గొన్నారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మరికల్, మే 29: లాక్డౌన్ నిబంధనలు పక్కాగా ఆమలు చేస్తామని మరికల్ సీఐ శివకుమార్ తెలిపారు. ప్రజలు ఉదయం 10 తర్వాత బయటకు వస్తే కేసులు నమేదు చెస్తామని హెచ్చరించారు. ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులు ఉదయం 10 గంటలలోపు తీసుకోవాలని కోరారు. శనివారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 27 మందిపై కఠిన చర్యలు తీసుకున్నమన్నారు. మాస్కులు ధరించనివారికి ఎస్పీ ఆదేశాల మేరకు 27మోటర్ సైకిళ్లకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించి మాస్కు లు ధరించి కరోనా వైరస్కు దూరంగా ఉండలని కోరారు.
కొనసాగుతున్న ఆంక్షలు
నారాయణపేట రూరల్,మే 29: పేట పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. శనివారం పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్లలో నిబంధనలు పాటించనివారికి పోలీసులు, మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఎస్సై సైదయ్య, సిబ్బంది వివిధ కూడళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేసి వాహనదారులకు అవగాహన కల్పించి ఈ పెట్టి కేసులు నమోదు చేసి పలు వాహనాలను సీజ్ చేశారు.