వనపర్తి, ఏప్రిల్ 28 : పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపుతుందని , ప్రజలు కరోనాపై జాగ్రత్తలు పాటించాలని వార్డు కౌన్సిలర్ పుట్టపాకుల మహేశ్ సూచించారు. బుధవారం పట్టణంలోని 13వ వార్డులోపాటు సబ్రిజిస్టర్ కార్యాలయంలో మొత్తం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వార్డులు మొత్తం పిచికారీ చేయించామని వారు తెలిపారు.
బాలకిష్టాపూర్లో..
ఆత్మకూరు, ఏప్రిల్ 28: మండలంలోని బాలకిష్టాపూర్ గ్రామంలో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సర్పంచ్ తుకారాంనాయక్ నేతృత్వంలో గ్రామంలోని రహదారులు, మురికి కాలువల వెంట పంచాయతీ సిబ్బంది ద్రావణం పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తుకారాంనాయక్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మాస్కు ధారణ, భౌతికదూరం పాటిస్తూ అవసరం ఉంటేనే బయటకు రావాలన్నారు. అందరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
పాన్గల్, ఏప్రిల్ 28 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచులు రాజేశ్వరమ్మ, శ్యామలమ్మలు అన్నా రు. బుధవారం మండలంలోని బండపల్లి, దొండయిపల్లి గ్రామాల్లో సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుధాకర్రెడ్డి, శాంతయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.