మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శేఖర్రెడ్డి
భూత్పూర్, మే 28 : గ్రా మాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చే యాలని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎం పీడీవో కార్యాలయంలో మం డల సర్వసభ్య సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భం గా పలు అంశాలపై చర్చించా రు. ముఖ్యంగా ఎల్లూరు బ్రాంచ్కు జూన్ 7వ తేదీ నుంచి మిషన్ భగీరథ నీ టి సరఫరా నిలిచిపోతుందని, గ్రామాల్లో ఉన్న నీటి వనరులను ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సద్వినియోగం చేసుకోవాలని డీఈ ప్రదీప్ తెలిపారు. ఎల్లూరు పంపుహౌస్ మరమ్మతుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. పదోతరగతిలో 503 మంది విద్యార్థులకుగానూ 181 మందికి 10 జీపీఏ వచ్చినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. మద్దిగట్ల గ్రామశివారులో కల్వకుర్తి కెనాల్లో చెక్డ్యాంలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఎంపీపీ కోరారు. సమావేశంలో వైస్ఎంపీపీ నరేశ్, సింగిల్విండో చైర్మన్ కదిరెఅశోక్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజా, ఎంపీడీవో మున్ని, తాసిల్దార్ చెన్నకిష్టన్న ఉన్నారు.