పాన్గల్, మార్చి 23 : గర్భిణులు, బాలింతలు, విద్యార్థులు తప్పనిసరిగా సరైన పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని అంగన్వాడీ సూపర్వైజర్ సువర్ణ అ న్నారు. పోషణపక్షం వారోత్సవాల్లో భాగంగా మంగళవా రం మండలంలోని దవాజీపల్లి, జమ్మాపూర్ గ్రామాల్లో పౌష్టికాహారంపై ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు. అదేవిధంగా చిన్నారుల పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యపోషణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం బద్రూనాయక్, లక్ష్మణ్గౌడ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గ్రామాల్లో పోషణ అభియాన్
ఖిల్లాఘణపురం, మార్చి 23 : మండలంలోని మానాజీపేట, కొత్తపల్లి తండాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ జ్యోతి ము ఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు, మహిళలకు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారమైన ఆకుకూరలు, బీట్రూట్, గుడ్డు, పాలు తదితర పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దేవకమ్మ, శిరీష, ప్రియ, ప్రభావతమ్మ పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, మార్చి 23 : గుమ్మడి కాయ రసంతో విద్యార్థిని విద్యార్థులకు రక్తహినతను పొగట్టవచ్చునని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని రామకిష్టాపురం గ్రామంలో పోషకోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు గుమ్మడి కాయ రసాన్ని తయారు చేసి విద్యార్థులకు అందజేశారు. అంగన్వాడీలో అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, అలాగే గుడ్లు, పాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అంతకుముందు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రేవతమ్మ, రజిత, అంగన్వాడీ కార్యకర్తలు నిర్మలమ్మ, శ్రీదేవి పాల్గొన్నారు.
మదనాపురంలో..
మదనాపురం, మార్చి 23 : పోషణపక్షం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో సూపర్వైజర్ భారతి ఆధ్వర్యంలో కిశోర బాలికలకు రక్తహీనతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిశోర బాలికల్లో సరైన ఎదుగుదలకు అధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారుల వెంబడి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, పుష్పలత, శారద పాల్గొన్నారు.