మరో ఐదు గొర్రెలకు గాయాలు
దాదాపు రూ.7 లక్షల ఆస్తి నష్టం
కొత్తకోట, మే 22 : రోడ్డు దాటుతున్న గొర్రెలను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 55 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని నాటవెల్లి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకున్నది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం మేరకు.. టీఎన్30పీహెచ్ 6777 నెంబర్ గల లారీ కర్నూల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నది. ఈ క్రమంలో నాటవెల్లి సమీపం నీళ్లు తాగేందుకు చెరువులోకి వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 55 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు గాయపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితుడు గొల్ల జంపన్న తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు. ప్రభుత్వ పరంగా కాపరి కుటుంబాన్ని ఆదుకుంటామని సర్పంచ్ లావణ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నబీ తెలిపారు.