వనపర్తి టౌన్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త, వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని టీజేఏసీ చైర్మన్ రాజారాంప్రకాశ్, విశ్వకర్మ అధ్యక్షుడు పరమేశ్వరాచారి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వేర్వేరుగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పాలిటెక్నిక్ కళాశాల మైదానం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అదేవిధంగా తెలంగాణ కవి గాయకుడు గూడ ఆంజయ్యకు కూడా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నాగేందర్సాగర్, నాగరాజు, యాదయ్య, వెంకటేశ్, బాలు, మన్నెం, చెన్నయ్య, బ్రహ్మచారి మూర్తి, వెంకటస్వామి, భాస్కరాచారి, సత్యనారాయణచారి, వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్యచారి, రామాచారి, మాధవాచారి, ప్రకాశ్చారి ఉన్నారు.
మదనాపురంలో..
మదనాపురం, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన విగ్రహానికి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు సత్యంయాదవ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎంపీపీ పద్మావతి, సర్పంచ్ రాంనారాయ ణ హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సీడీసీ డైరెక్టర్ బాలకృష్ణ, నాయకుడు అశోక్ యాదవ్ పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు, జూన్ 21 : అమరచింత మండల కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి జయశంకర్సార్ విగ్రహానికి జయశంకర్ సారు సేవా సంస్థ ప్రతినిధులు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పూ లమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సార్ చేసి న సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు తిరుమలేశ్, నాయకులు రాము, వెంకటాచారి, నరేశ్, రాఘవేంద్ర పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, జూన్ 21 : మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా తెలంగా ణ తల్లి విగ్రహంతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, నాయకు లు కృష్ణయ్య, భూమయ్య, కమ్మరి గోపి, గోపాల్, బాల్రెడ్డి, ఆంజనేయులుగౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.