ఊట్కూర్, మే 19 : గ్రామాల అభివృద్ధే ల క్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జె డ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సహకారంతో ఎ న్నికల్లో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎంకేంపేటలో జీపీ నిధులనుం చి రూ. 5 లక్షల అంచనా వ్యయంతో అతాఉల్లా హోటల్ నుంచి ఏక్మినార్ మసీదు వరకు సీసీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దశల వారీగా మండలంలో అన్ని వార్డుల్లో సైడ్ కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. అభివృద్ధి ప నులకు పార్టీలకతీతంగా ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బా ల్రెడ్డి, మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, మండల కోఆప్షన్ సభ్యు డు అబ్దుల్ రహిమాన్, ఉపసర్పంచ్ ఇబాదుల్ ర హిమాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.