వనపర్తి, ఏప్రిల్ 7: జిల్లాలో యాసంగి పంటగా రైతులు సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చే వారం చివరలో కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రారంభించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగిలో 3లక్షల 40వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐకేపీ 103, పీఏసీసీఎస్ 114, మార్కెట్ కమిటీ 2, మెప్మా 2 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇందుకు సరిపడా గన్నీ బ్యాగులు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు. వరిధాన్యం గ్రేడ్ ఏ క్వింటాకు రూ 1,888, సాధారణ వరి ధాన్యం రూ. 1,868 ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాక్ప్రెసి క్యూషన్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి రైతులు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని కొవిడ్ కేంద్రాల దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, కేంద్రాలవద్ద శానిటేషన్ చేయించాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని, వరి ధాన్యం చేరవేసేలా సంబంధిత వరి ధాన్యం రవాణా దారులు చూడాలని, వరి ధాన్యం కేంద్రాలను డీఆర్డీవో, డీసీవో అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఎం సీఎస్ అనిల్కుమార్, సివిల్ సైప్లె అధికారిణి రేవతి, డీఆర్డీవో నరసింహులు, డీసీఎస్వో కోదండరాములు, మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ అధికారులు, రైస్మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.