పెబ్బేరు, మే 18 : జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైనా సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్యామల, ఎంపీపీ శైలజ, టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రటించిన సీఎం కేసీఆర్, కృషి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం సుభాష్చంద్రబోస్ చౌరస్తాలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నిరంజన్రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అక్కమ్మ, కోఆప్షన్ సభ్యులు ఎండీ ముస్తాక్, ఐజాక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైస్చైర్మన్లు బుచ్చారెడ్డి, విశ్వరూపం, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు హరిశంకర్ నాయుడు, రాము లు యాదవ్, పట్టణ ఉపాధ్యక్షులు సాయినాథ్, ఎల్లయ్య యాదవ్, సర్పంచ్ వెంకటేశ్, నాయకులు కురుమూర్తి, వేణుయాదవ్, రాములు, సంతోష్, వెంకటయ్య, ఎండీ ఖాజా, జహీర్ పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్ మండలంలో..
వనపర్తిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు, కృషి చేసిన మంత్రి నిరంజన్రెడ్డికి మండల ప్రజల తరఫున టీఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భగా నాయకుడు పృథ్వీరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు పడిన ప్రజలకు అందాల్సిన సంక్షేమం ఎక్కడ ఆగడం లేదన్నారు. ధన్యవాదాలు తెలిపిన వారిలో సింగిల్విండో అధ్యక్షుడు జఘన్నాథం నాయుడు, ఎంపీపీ గాయత్రి, సర్పంచ్ వినీల రాణి, కోఆప్షన్ సభ్యుడు ఆరీఫ్, కురుమయ్య, రమేశ్ ఉన్నారు.
వనపర్తి పట్టణంలో..
వనపర్తి టౌన్, మే 18 : వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృషి చేసిన మంత్రి నిరంజన్రెడ్డి చిత్రపటాలకు మంగళవారం టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వనపర్తి జిల్లా విద్యాపర్తిగా ఎంతో పేరుందని మంత్రి నిరంజన్రెడ్డి కృషితో జిల్లాకు మెడికల్ కళాశాలను తీసుకురావడం ఎంతో హార్షనీయమన్నారు. మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దమందడి మండలంలో..
పెద్దమందడి, మే 18 : జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుకావడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు సేనాపతి, ప్రవీణ్రెడ్డి, విండో డైరెక్టర్ నరేశ్, ఎంపీటీసీ చెన్నమ్మ, నల్గొండయాదవ్, ఉప సర్పంచ్ రాంచంద్రయ్య, గోపాల్, పురుషోత్తంరెడ్డి, సత్యారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, మే 18 : జిల్లాకు వైద్య కళాశాల మంజూరు పట్ల టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాములుయాదవ్, జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు శ్రీనుజీ, కోఆప్షన్ సభ్యుడు శ్రీను హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వైద్యరంగంలో జిల్లాను ముందుంచాలని దూరదృష్టిలతోనే వైద్యకళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు శాంతిరాజ్, సంతోష్ పాల్గొన్నారు.
మంత్రి చొరవతోనే
రేవల్లి, మే 18 : మంత్రి నిరంజన్రెడ్డి చొరవతోనే వనపర్తికి మెడికల్ కళాశాల మంజూరు అయ్యిందని టీఆర్ఎస్ నాయకుడు విజయ్మోహన్ మంగళవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాడు. మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేసిన మంత్రికి వనపర్తి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.