జడ్చర్లటౌన్, ఏప్రిల్ 18 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లు చెల్లింపునకు వివిధ పార్టీల నాయకులు క్యూ కట్టారు. మూడు రోజుల్లోనే రూ.14లక్షల ఆస్తిపన్ను, నల్లా బిల్లులు వసూలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తిపన్ను, నల్లా బి ల్లుల బకాయిలు లేకుండా నోడ్యూ సర్టిఫికెట్ను నామినేషన్తోపాటు సమర్పించాలని అధికారులు సూచించడంతో అభ్యర్థులు బకాయిలను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈనెల 16 నుంచి 18వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అయితే నామినేషన్ వేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదించే వారు కూడా ఇంటిప న్ను, నల్లా బిల్లుల బకాయిలు లేకుండా చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్ను జతచేయాలని అధికారులు సూచించారు. దీంతో జడ్చర్ల మున్సిపాలిటీలోని మొత్తం 27వార్డులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ నామినేషన్లు వేసే ముందు బకాయిలను చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్లను తీసుకున్నారు. మొత్తం 228 మంది అభ్యర్థులు బకాయి పన్నులను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పదేండ్లుగా బకాయి ఉన్న ట్యాక్సులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా వసూలైనట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
లాక్డౌన్ భయాలు: స్వస్థలాలకు వలస కార్మికులు
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు