కృష్ణ, మే 17 : సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం పది రోజులపాటు లాక్డౌన్ను ప్రకటించడంతో మం డల వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణ వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో వాహనాలు రోడ్డెక్కలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక -తెలంగాణ సరిహద్దు కృష్ణ మండలంలోని గుడేబల్లూర్, చేగుంట చెక్పోస్టులవద్ద సోమవారం అంతర్జాతీయ రహదారిపై వాహనాలు నిలుపకుం డా అన్ని చర్యలు చేపట్టారు. సరిహద్దుల చెక్పోస్టులను సీఐ శంకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిసున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అత్యవసర వాహనాలు మినహా అన్ని వాహనాల ను వెనక్కి పంపించారు. కార్యక్రమంలో ఎస్సై మురళి, పోలీస్ సిబ్బంది, వీఆర్వో, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.