ఐదేండ్లలో మారిన రూపురేఖలు
రూ.కోట్లతో అభివృద్ధి పనులు
రూ.2 కోట్లతో రోడ్డుపై డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు
బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా ఎంపిక
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 17 : అచ్చంపేట మున్సిపాలిటీలో ఐదేండ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణంలో 2011 జనాభా లె క్కల ప్రకారం 29,425 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 20,529 మంది ఓటర్లు (మహిళలు 10, 428, పురుషులు 10,100, ఇతరులు 1) ఉన్నా రు. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత 2016 ఫిబ్రవరి 7న అచ్చంపేట లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. 2016 మార్చి 15న కొలువు దీరిన పాలకవర్గం.. నాటి ఎ మ్మెల్యే గువ్వల బాలరాజు సహకారంతో ప్రజా సం క్షేమం, పట్టణాభివృద్ధే ధ్యేయంగా ముందుకు కదిలారు. 20 వార్డుల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించడంతో అభివృద్ధి సులువుగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరుగుదొడ్ల నిర్మాణాలను నడుం బిగించారు. మొదటగా 900 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత నగర పంచాయతీ అధికారులు, కౌన్సిలర్ల కృషితో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా చేశారు. బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా అచ్చంపేట ఎంపికకావడంతో 2016 ఆగస్టులో అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టీకే శ్రీదేవి అవార్డు, ప్రశంసాపత్రాలు అందజేశారు. నాటి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అచ్చంపేట నగర పంచాయతీ పరిధిలోని దర్శన్గడ్డ తండాలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించి ప్రశంసించారు. 2016 ఆగస్టు 1వ తేదీన కరీంనగర్ జిల్లాలో జరిగి న సమావేశంలో మంత్రి కేటీఆర్ స్వయంగా అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ తులసీరాంను వేది కపైకి పిలిచి బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా రూపుదిద్దేందుకు తీసుకున్న చర్యలపై మా ట్లాడించారు. ఇదిలా ఉండగా, పట్టణాభివృద్ధి కోసం కౌన్సిల్ సమావేశాల తీర్మానాలతో విద్యానగర్ కాలనీలో రూ.11 లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశా రు. 3,351 ఎల్ఈడీ లైట్లు బిగించారు. రూ.3 కో ట్లతో సీసీ రోడ్లు, రూ.4.51 కోట్లతో డ్రైనేజీలు నిర్మించారు. రూ.7.27 కోట్లతో ప్రధాన రహదారుల వెం ట డ్రైనేజీ సౌకర్యం కల్పించారు. డంపింగ్ యార్డు కోసం రూ.33 లక్షలతో స్థలం కొనుగోలు చేసి.. రూ.172.50 లక్షలతో ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 2018లో నగర పంచాయతీ నుంచి పు రపాలికగా ఏర్పడడంతో చైర్మన్ తులసీరాం ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. యువతకు విజ్ఞానాన్ని అందించేందుకు వీలుగా వలపట్ల కాలనీలో రూ.32.50 లక్షలతో అంబేద్కర్ కళాభవన్ నిర్మించి విప్ గువ్వల చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రధాన రహదారిపై రూ. 2 కోట్లతో డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ప నులు చేపట్టారు. సాయినగర్ కాలనీ సమీపంలోని శ్మశానవాటికను రూ.1.1 కోట్లతో నిర్మించారు. అటవీశాఖ కార్యాలయం సమీపంలో రూ.2.27 కో ట్లతో స్మృతివనం, రూ.60 లక్షలతో జంక్షన్ల అభి వృద్ధి పనులు టెండర్ దశలో ఉన్నాయి. మిషన్ భగీరథ పనుల అనంతరం వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4 కోట్లు, కుల సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణాలకు రూ.2 కోట్లు, వ్యవసాయ మార్కెట్ ప్రహరీ విస్తీర్ణం కోసం రూ.75 లక్ష లు, ఆయా కాలనీల్లో ఓపెన్ జిమ్ల ఏర్పాటు కోసం కేటాయించిన రూ.30 లక్షలు టెండర్ దశలో ఉన్నా యి. మిషన్ భగీరథకు రూ.36.9 కోట్లు కేటాయిం చారు. గడిచిన ఐదేండ్లలో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు పట్టణ ప్రజలకు, మొదటి పాలకవర్గానికి స్ఫూర్తిదాయకంగా ని లుస్తున్నాయి. పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు విప్ గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ను కలిసి రూ.105 కోట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు అందజేశారు. అచ్చంపేట మొదటి పాలకవర్గం 2021 మార్చి 14న పదవీ కాలం ము గియడంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.