భౌతిక దూరం పాటించని వైనం
అవగాహన కల్పించని అధికారులు
బాలానగర్, మే 14 : కరోనా గొలుసును తెంచేందుకు ప్రభుత్వం లాక్డౌన్ వంటి కట్టడి చర్యలు తీసుకుంటే జనా లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యవసర కొ నుగోళ్లు విధించిన సడలింపు సమయాల్లో బాధ్యతలేని జ నాలు మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. మండల కేం ద్రంలో శుక్ర వారం ఉదయం 6 గంటల నుంచి 10 గం టల మధ్య కాలంలో కూరగాయల దుకాణాల వద్ద, కిరా ణా షాపుల వద్ద, హోటళ్ల వద్ద కిక్కిరిసిన జనాల దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనాలు ఏమా త్రం కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూ రం పాటించకుండా ఒకరిమీద ఒకరు పడిపోతున్నారు. కోరలు చాస్తున్న కరోనా పట్ల ఎ లాంటి ఆందోళన లేకపోవడం విచారకరం. మరో వైపు కరోనా కట్టడికి చ ర్యలు తీసుకోవాలని పోలీసులకు, రె వెన్యూ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రెవె న్యూ అధికారులు కరోనా కట్టడిపై అ వగాహన కల్పించడంతో పాటు ని యంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్పందించడం లేదు. ఎవరే మై పోతే మాకేం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి కరోనా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.