డీఎస్పీ మధుసూదన్రావు
కోస్గి, మే 14 : పట్టణంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని నారాయణపేట డీఎస్పీ మధుసూదన్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో లాక్డౌన్ అమలు తీరు ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి బయట తిరిగే వాహనదారులకు జరిమానా విధించాలని సూచించారు. లాక్డౌన్ అమలు కఠినతరంగా ఉం డాలని ఎవరూ అనవసరంగా బయటతిరగరాదన్నారు. స్థానికంగా పెట్రోలింగ్ టీం ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎస్సై న రేందర్ సిబ్బంది ఉన్నారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మరికల్, మే 14 : తెలంగాణ ప్రభుత్వం ప్రజా శ్రేయ స్సు కోసం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను విధించిందని, లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తామని మరికల్ సీఐ శివకుమార్ తెలిపారు. ప్రజలు ఉదయం 10 తర్వాత బయటకు వస్తే కేసులు నమేదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు తమకు కావలసిన నిత్యావసర సరుకులు ఉదయం 10గంటలలోపు తీసుకోవాలని కోరారు. ఎవరైనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, లేకుంటే ఎస్పీ ఆదేశాల మేరకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కరోనా వైరస్కు దూరంగా ఉండాలని కోరారు.
కరోనాపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
కరోనా కట్టడి కి ప్రభుత్వం లా క్డౌన్ విధించడంతో ఉదయం 6 గంటల నుం చి 10 గంటల వరకు తమకు కావలసిన ని త్యావసర సరుకులు, వస్తువు లు తెచ్చుకొని 10 గంటల తర్వాత బయటకు రాకూడదని కోరుతూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆటోలో మైక్ ఏర్పాటు చేసి వీధుల్లో తిరుగుతూ మరికల్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇంట్లోనే ఉండి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. కరోనాపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో ప్రజలు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కొనసాగిన లాక్డౌన్
హన్వాడ మే 14 : కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ శుక్రవారం మం డలంలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులను తెరువగా, తరువాత స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని గ్రామాల్లో తమ ఇష్టానుసారంగా దుకాణాలను తెరుచుకుంటున్నారు. ప్రతిఒక్కరూ లాక్డౌన్కు సహకరించాలని ఆయా గ్రామాల ప్ర జాప్రతినిధులు కోరారు.