టీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్
బాలానగర్, జూన్ 13 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అక్రమ ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నారని టీఆర్ఎస్ యూత్ వింగ్ మం డల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దరేవల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్లో ఈటల రాజేందర్ రాజకీయంగా ఎదిగి కన్నతల్లిలాంటి పార్టీని మోసం చేశారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఆస్తులను కూడా పెట్టుకున్నాడ ని, ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ముదిరాజ్లంతా టీఆర్ఎస్వైపే ఉన్నారన్నారు. సమావేశంలో సింగిల్విండో డైరెక్టర్ గుడిసెల యాదయ్య, ఏఎంసీ డైరెక్టర్ మల్లే శ్, టీఆర్ఎస్ యూత్ వింగ్ మండల సంయుక్త కార్యదర్శి కృష్ణ, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పరమేశ్వర్, నర్సింగ్ పాల్గొన్నారు.