ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
బలిగేరలో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి వర్ధంతి
గట్టు, జూన్ 12 : బలహీన వర్గాల అభ్యున్నతికి మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రె డ్డి అన్నారు. మండలంలోని బలిగేరలో గట్టు భీముడి వ్యవసాయ క్షేత్రంలో శనివారం ని ర్వహించిన వర్ధంతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీల్లో గుర్తింపు పొందిన నాయకుడు గట్టు భీముడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు గట్టు భీముడిని మరువవన్నారు. రాష్ట్ర కన్జ్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం గట్టు భీముడితోనే సాధ్యమైందన్నారు. పేదలకు అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. గజ్జెలమ్మ గట్టు ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చింది ఆయనే అన్నారు. కార్యక్రమంలో గట్టు భీముడి భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీలు విజయ్కుమార్, ప్రతాప్గౌడ్, జెడ్పీటీసీలు బాసు శ్యామల, రాజశేఖర్, సింగిల్ విండో చైర్మన్ క్యామ వెంకటేశ్, బలిగేర సర్పంచ్ హనుమంతు నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.