ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
కొవిడ్ బాధితులకు భోజనం పంపిణీ
పాల్గొన్న ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆల
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9 : ప్రస్తుత పరిస్థితు ల్లో అభాగ్యులకు అండగా నిలిచి ఆదుకుందామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో వైద్యసేవలు పొందుతున్న కరోనా బాధితులు, వారి సహాయకులకు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేతులమీదుగా భో జనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బాధితులు, వారి సహాయకులకు భోజనం అందించి ఆకలి తీరుస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, సుదీప్రెడ్డి, మనీశ్, గణేశ్, సత్యపాల్, సూరి, అఖిల్, రామకృష్ణ పాల్గొన్నారు.
ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
పేదలకు వైద్యసేవలు అందించేందుకు ఉచితంగా మొయి న్ అలీ మహ్మద్దీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ను వితరణ చేయగా మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం మంత్రి చేతుల మీదుగా అంబులెన్స్ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, 29వ వార్డు కౌన్సిలర్ మొయిన్ అలీ, ఆర్టీఏ మెంబర్ జావేద్బేగ్ తదితరులు పాల్గొన్నారు.
శానిటైజర్లు, మాస్కులు పంపిణీ
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో బుధవారం ప్రైవేట్ దవాఖానల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశా రు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి వార్తలను సేకరించి సమాజానికి అందిస్తున్న జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయ డం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, సుశ్రుత ప్రజావైద్యశాల డాక్టర్ మధుసూదన్రెడ్డి, మీనాక్షీ దవాఖాన డాక్టర్ రామ్మోహన్, నేహాసన్ షైన్ దవాఖాన డాక్టర్ విజయ్కుమార్, మల్లికా దవాఖాన డాక్టర్ మహేశ్బాబు, అనిల్ సర్జికల్ దవాఖాన అనిల్ వట్టేమార్, డాక్టర్ శామ్యూల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు ఉన్నారు.
మంత్రికి సన్మానం
మహబూబ్నగర్టౌన్, జూన్ 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఆమోదం తెలుపడంతో పీఆర్టీయూ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. ఉద్యోగుల సమస్యల కోసం మంత్రి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ్గౌడ్, రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.