మక్తల్ టౌన్,మే 9: మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా స్థానం కల్పిస్తున్నారని మక్తల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు బుక్క శంషొద్ద్దీన్ అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ఏడో వార్డులోని రహమానియా కాలనీలోని మసీదులో రంజాన్ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని మతాలను వారి వారి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం తరుఫున కానుకలు అందజేస్తున్నారన్నారు. అదేవిధంగా రంజాన్ను దృష్టిలో పెట్టుకొని రంజాన్ కిట్లను అందించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. అదే విధంగా మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించిందన్నారు. కార్యక్రమంలో రహమానియా మసీదు ప్రెసిడెంట్ రహీమ్, హబీబ్, ఇజాజ్, అలీ, మౌలానా నసీర్ పాల్గొన్నారు.
రంజాన్ తోఫాల పంపిణీ
నారాయణపేట, మే 9 : పట్టణంలోని 23వ వార్డులో కౌన్సిలర్ మహ్మద్ తఖీ చాంద్ ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలు రంజాన్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్న ఉద్దేశంతో రంజాన్ తోఫాలను అందజేస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పని సరిగ్గా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్ బచ్చో, మహ్మద్ షరీఫ్ ఖురేషీ, అబ్దుల్ ఖాదర్ మైసూర్, మహ్మద్ షాహబుద్దీన్ చాంద్ పాల్గొన్నారు.