ధరూరు, జూన్ 8: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాములు అన్నారు. మండలంలోని గార్లపాడు గ్రామంలో సిబ్బందితో సోదాలు చేయగా 50కేజీ ల బస్తా లూజ్ పత్తి విత్తనాలు పట్టుబడినట్లు తెలిపారు. బే రం రవి ఇంట్లో అక్రమంగా 50కేజీల లూజ్ పత్తివిత్తనాలు గుర్తించి మండల వ్యవసాయాధికారిణి శ్రీలత ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయ డం చట్టరీత్యా నేరమని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటేశ్వర్గౌడ్, కానిస్టేబుల్ కృష్ణ ఉన్నారు.
విత్తనాల దుకాణాలు తనిఖీ
వడ్డేపల్లి, జూన్ 8 : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై శ్రీహరి, వ్యవసాయాధికారి రాధ మంగళవారం శాంతినగర్లోని విత్తనాలను విక్రయించే దుకాణాలను ఆకస్మికం గా తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించారు. విత్తనాల విక్రయ దుకాణాల్లో లైసెన్సులు, రేట్ల పట్టిక, స్టాకు వివరాలను పరిశీలించారు. రశీదు లేకుండా లూజుగా విత్తనాలను విక్రయించేవారి వద్ద రైతులు కొనవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై పీడీయాక్ట్ అమలు పరుస్తామని ఎస్సై తెలిపారు. గ్రామాల్లో కూడా నిఘా ఉంచామని వ్యవసాయాధికారి రాధ అన్నారు.
నకిలీ విత్తనాలు పట్టివేత
మల్దకల్, జూన్ 8: మండలంలోని మంగంపేటలో మంగళవారం నకిలీ విత్తనాలు దొరకిన ఘటన చోటు చేసకున్నది. ఏవో రాజశేఖర్, ఎస్సై శేఖర్ మాట్లాడుతూ మంగంపేటకు చెందిన రంగస్వామి రైతు ఇంట్లో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఏవో రాజశేఖర్, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో గ్రామానికి చేరుకొని రంగస్వామి ఇంటిని సోదా చేశారు. ఇంట్లో ఆక్రమంగా 2.50 క్వింటాళ్ల పత్తి విత్తనాలు గుర్తించామన్నారు.
వెంటనే వాటిని మల్దకల్ పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. ఏవో ఫిర్యాదుతో రంగస్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.