ఊట్కూర్, మే 7 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలోని పేదల పిల్లలకు మంచి భోజన వసతితో కూడిన మెరుగైన విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షాదీ ముబారక్ సీఎం కేసీఆర్ అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. ప్రతి పేద ముస్లిం సంతోషంగా రంజాన్ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతోపాటు దుస్తుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన ముఖ్యమైన పండుగల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినట్లు చెప్పారు. అనంతరం పెద్దజట్రం, నిడుగుర్తి తదితర గ్రామాల్లో తాసిల్దార్ తిరుపతయ్య ఆధ్వర్యంలో రంజాన్ కిట్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ ఇబాదుర్ రహిమాన్, టీఆర్ఎస్ నాయకులు గంగాధరాచారి, తరుణ్రెడ్డి, వెంకటేశ్గౌడ్, శివారెడ్డి పాల్గొన్నారు.