ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నవాబ్పేట, జూన్ 6 : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రుద్రారం యాదిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే డా.సీ.లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన యాదిరెడ్డి సంతాపసభకు వారు హాజరై..ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదిరెడ్డి సుదీర్ఘకాలం పాటు మండల రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. యాదిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. అనంతరం పోమాల సర్పంచ్ కృష్ణయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచ్ గోపాల్గౌడ్, నా యకులు మధుసూదన్రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణగౌడ్, రాజశేఖర్రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.