యువతకు స్ఫూరిగా నిలుస్తున్న అరైజ్ అవేక్ గ్రూప్
కరోనాపై అవగాహన కార్యక్రమాలు
మహబూబ్నగర్టౌన్, జూన్ 6 : సామాజిక సేవలో…మేము సైతం అంటూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గత ఏడాది జనవరి 12న ఎదిర 4వ రెవెన్యూ వార్డులో యువకులు ‘మేల్కోండి..మేలు కొల్పండి’ పేరిట కే.రమాకాంత్రెడ్డి గ్రూప్ ఏర్పాటు చేశారు. గ్రామ యువకులతో కలిసి పెద్దల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అరైజ్ అవేక్ గ్రూప్ ఫౌండర్గా, అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక రుగ్మతలను రూపమాపడంతోపాటు గతేడాది కరోనా సమయంలో వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎదిర, దివిటిపల్లి, అంబటిపల్లి, సిద్ధాయపల్లిలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి తమ వంతు సహకారం అందించారు. కౌన్సిలర్ యాదమ్మతో పాటు అన్ని వర్గాల ప్రజలు,నాయకుల వీరికి అండగా నిలిచారు.
అవగాహన కార్యక్రమాలు
గతేడాది కరోనా సమయంలో గ్రూప్ స భ్యులు అవగాహన కార్యక్రమాలతోపాటు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి వీధుల శుభ్రం, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని 40మందికిపై ఉన్న సైనికులను ఘనంగా సన్మానించారు. కమిటీ సభ్యులు శివకుమార్గౌడ్, గణేశ్,నరేశ్, వెంకట్, రాఘవ, రాఘవేందర్, శ్రీకాంత్రెడ్డి,రవికుమార్, శివకుమార్, ఫైజల్, రమేశ్ కొనసాగుతున్నారు. ఏనుగొండ నుంచి దివిటి పల్లి వరకు ఉన్న ప్రధాన రోడ్డుపై నిరంతరం ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో అందరి సహకారంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువతకు జాబ్మేళా నిర్వహించి ఉపాధి అవకాశాలను చూపిస్తున్నారు