మదనాపురం, జూన్ 5 : కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం సజావుగా కొనసాగుతున్నదని ఎస్సై తిరుపాజి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లాక్డౌన్ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారస్తులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాగే మరికొన్ని రోజులు ప్రజలు సహకరిస్తే, కరోనా మహ్మమారిని అరికట్ట వచ్చని అన్నారు. కార్యక్రమంలో కుర్మయ్యగౌడ్, రవికుమార్, సాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, జూన్ 5 : కొవిడ్ కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యాపార సముదాయాలన్నీ తెరుచుకోవడంతో ప్రతిరోజు ప్రజలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అన్ని దుకాణ సముదాయాలు మూసివేసి లాక్డౌన్ పాటించారు.