పెబ్బేరు రూరల్, జూన్ 5 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలతో సహా, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దుచేయాలని రైతాంగ పోరాట సమన్వయ కమిటీ నాయకుడు జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశా రు. శనివారం ఆయన రైతులతో కలిసి శాఖాపు రం, రాంపురం గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశా రు. చట్టం ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, బాలస్వామి, శేఖర్రెడ్డి, రామ్మోహనరెడ్డి పాల్గొన్నారు.