మొక్కుబడిగా సాగుతున్న సమావేశాలు
సమస్యల పరిష్కారంపై కనిపించని శ్రద్ధ
నేడు మండల సర్వసభ్య సమావేశం
బాలానగర్, జూన్ 3 : ప్రజా సంక్షేమ పథకాల అమలు .. సాధించిన ప్రగతి.. చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాల్లో జవాబుదారీతనం కొరవడుతున్నది. ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపకుండా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. మండల స ర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అ ధికారులు పూర్తిస్థాయి నివేదికలతో హాజరు కావాల్సి ఉండగా, పలు శాఖల అధికారులు కిందిస్థాయి సిబ్బందిని సమావేశానికి పంపించి అయ్యిందనిపిస్తున్నారు. గత మార్చి 9న నిర్వహించిన సమావేశానికి విద్యుత్, గ్రంథాల య, మత్స్య శాఖ తదితర శాఖలు ప్ర గతి నివేదికలను అందజేయలేదు. ము ఖ్యమైన శాఖలు నివేదికలు ఇవ్వకపోవడంతో మండలంలో ఏ అభివృద్ధి పనులు ఎంతమేర జరిగాయనే విషయం తెలియడంలేద ని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు బ హిరంగగానే విమర్శిస్తున్నారు. అలా గే గతంలో నిర్వహించిన పలు సమావేశాల్లో విద్యుత్ సమస్య తీర్చాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించినా నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. మండలంలో ఆధార్ నమోదు కేంద్రం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మండలంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని పలువురు సభ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకురావాల్సిన సర్పంచులు, ఎంపీటీసీలు కొందరు సర్వసభ సమావేశానికి డుమ్మా కొట్టడం విశేషం. శుక్రవారం ని ర్వహించే సమావేశానికైనా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని మం డల ప్రజలు కోరుతున్నారు.