కొత్తకోట, జూన్ 2 : కరోనాను దూరం చేసేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్యా వలంటీర్లకు ఎంపీపీ గుంతమౌనిక సొంత ఖర్చులతో ఉమ్మడి మండలాలకు చెందిన వలంటీర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన సీఎం సహయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి షెడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.
రూ.2లక్షల చెక్కు అందజేత
కొత్తకోట పట్టణానికి చెందిన రాజేందర్గౌడ్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన రూ.2లక్షల చెక్కును మృతుడి భార్య శ్రీదేవికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, జెడ్పీటీసీ కృష్ణయ్య, నాయకులు వెంకట్నారాయణ, కొండారెడ్డి, భీంరెడ్డి, కౌన్సిలర్లు రామ్మోహన్రెడ్డి, రవీందర్రెడ్డి, ఖాజామైనొద్దీన్, అయ్యన్న, సుభాష్, రాములుయాదవ్, కోఆప్షన్ సభ్యులు వసీం, మిషేక్, శ్రీను, వహిద్, నాయకులు శ్రీనుజీ, అల్లభాష, జగన్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ
మండలంలోని పాలెం గ్రామానికి చెందిన న్యాయవాది అలీం కరోనా బారిన పడడంతో బుధవారం ఆయనను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మనోదైర్యాన్ని ఇచ్చారు. అలీం కొన్ని రోజులుగా పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొంది డిశ్చార్జి అయి ఇంటి వెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, సర్పంచ్ రాధ, రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ మైబు, నాయకులు మోహన్కుమార్ ఉన్నారు.