వనపర్తి రూరల్, జూన్ 2 : బడుగు బలహీన వర్గాల సొంతింటి కల త్వరలో నేరవేరనున్నదని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూంలు అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా సరిహద్దులోని పెద్దగూడెం, చిట్యాల గ్రామశివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, నూతన మార్కెట్ యార్డు ల పనులను మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములుతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల పరిసరాలలు మొక్కల నాటించాలని చెప్పారు. అలాగే జిల్లాకే తలమానికంగా చేపట్టిన నూతన మార్కెట్ యార్డుల పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, సంబంధిత అధికారు లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ తిరుమల్, నాయకులు వెంకటేశ్ తదితర నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను ఇప్పటికే పలు రంగాల్లో ముందుకు తీసుకెళ్లుతున్నారని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు.