పెబ్బేరు రూరల్, జూన్ 2 : లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తున్న కృష్ణమ్మకు ఆపదొచ్చింది. నదిలో ఇసుక తీతకు అనుమతు లు లేకపోయినప్పటికీ.. కొందరు అక్రమార్కుల కన్ను ఇసుక ది బ్బలపై పడింది. ‘ఎలాగైనా కొట్టేయాలన్నవాడికి ఐడియాలు కరు వా’ అన్నట్లు ఇసుక వ్యాపారులు కొత్త నాటకానికి తెరలేపారు. త మ ఇంటి అవసరాలకంటూ ఎడ్ల బండ్లలో ఇసుక తరలిస్తున్నారు. నిత్యం వందకు పైగా ఎడ్ల బండ్లలో ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రతి ఏడాది పట్టపగలు బాహాటంగా జా తీయ రహదారి సాక్షిగా ఈ తతంగం జరుగుతున్నా.. ఎవరూ ప ట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులైన రంగాపురం, బీచుపల్లి గ్రామాల మధ్యలో కృష్ణానది ప్రవహిస్తున్నది. నదిలో ప్ర తి వేసవిలో నీరులేని సమయంలో పెద్ద ఎత్తున ఇసుకరాసులు బ యటపడతాయి. కృష్ణా నదిలోంచి తట్ట ఇసుక తీసేందుకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. కానీ పొరుగు జిల్లాకు చెందిన కొందరు అక్రమార్కులు ఎలాగైనా ఇసుకను కొట్టేయాల న్న తలంపుతో కొత్త పంథా ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా ఎడ్ల బం డ్లను తయారు చేసుకొని ఇసుక అక్రమ రవాణాకు తెర లేపారు. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోకి వచ్చే యాక్తాపురం, తిమ్మాపురం, కొండపేట తదితర గ్రామాలకు చెందిన కొందరు తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు రోజుకు నాలుగైదు ట్రిప్పు ల చొప్పున ఎడ్ల బండ్లపై ఇసుకను తరలించి నిల్వచేసుకుంటున్నారు.ఇసుక డంపుల నుంచి రాత్రికి రాత్రి ట్రాక్టర్ల ద్వారా అవసరమున్న చోటుకు రవాణా చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
లొసుగులను ఆసరా చేసుకొని..
చట్టంలో ఉండే లొసుగులు అక్రమార్కుల పాలిట వరాలు కురిపిస్తున్నాయి. వాహనాల్లో తరలిస్తే కేసులవుతాయని భావించి.. ఎడ్ల బండ్లపై ఇసుకను తరస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు ఇతర వా హనాలో ఇసుక రవాణా చేస్తే కేసుతోపాటు వాహనాన్ని సీజ్ చే స్తారు. వాటి నుంచి బయటపడాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందని భావించి అక్రమార్కులు ఎడ్ల బండ్లను ఎంచుకున్నారు. ఎవరైనా అడిగితే ఇంటి నిర్మాణం కోసమని చెబుతున్నారు. డిమాండ్ను బట్టి ఒక్కో బండి ఇసుకను రూ.2 వేల వరకు విక్రయిస్తున్నా రు. సొంత అవసరాలకు సైతం నది ఇసుకను తరలించే నిబంధన ఎక్కడా లేదు.
నదిలోనే రోడ్డు ఏర్పాటు..
ఎవరూ ఏమీ చేయలేరన్న బరితెగింపుతో ఇసుకాసురులు తమకు అనుకూలంగా నదిలోనే రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. నదికి చెంతనే వీరి గ్రామాలుండటంతో బీచుపల్లి వైపు నుంచి రం గాపురం పుష్కరఘాట్ వరకు నదిలో దారి ఏర్పాటు చేసుకున్నా రు. ఈ దారి మీదుగా నేరుగా ఇసుక తిన్నెల వరకు వచ్చి, ఇసుక ను నింపుకున్న తర్వాత జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీదు గా వెళ్తున్నారు. ఈ రోడ్డు సాఫీగా ఉంటున్నందున ఇసుక కారిపోకుండా ఉండేందుకు ఇలా దారులు ఎంపిక చేసుకున్నారు. కొంద రు పిల్లలు కూడా పని చేస్తున్నారు. ఎడ్ల బండ్లు గమ్యం చేరే వరకు వ్యాపారులు వాటిని అనుసరిస్తున్నారు. ఈ తతంగం అంతా అన్ని శాఖల అధికారులకు తెలిసినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తూ కృష్ణానది గర్భశోకానికి కారణమవుతున్నారు.