చిన్నంబావి: నియోజకవర్గంలోని ప్రతిఒక్క సామాన్య, మధ్య తరగతి నిరుపేదలకు ఆపత్కర సమయంలో మెరుగైన వైద్యచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్వోసీ అందజేసి వారిని ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమేన ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నంబావి మండలం వెలుటూరు గ్రామానికి చెందిన డీ.ము రళి మోహన్గౌడ్ అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతుండగా,
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వారికి మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహానిధి నుంచి రూ.2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిలకు రుణపడి ఉంటామని సదరు కుటుంబ సభ్యులు తెలిపారు.