వనపర్తి రూరల్/హన్వాడ, డిసెంబర్ 7 : అవసరానికి తగినట్లుగా ఉత్పత్తులు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతి చేసుకున్నా కూడా సరిపోని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కూరగాయల పంది ర్లు వేసుకునే వారికి ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో రుణాలిస్తున్నది. నేలపై కూరగాయలు సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా రాదు. త్వరగా తెగుళ్లు వస్తాయి. ఈ క్రమంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కూ రగాయల పందిర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రైతులు శాశ్వత పందిర్లపై మొగ్గుచూపుతున్నారు. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఎక్కువగా టమాటా, వంకాయ, బెండకాయ, క్యాలీఫ్లవర్, బీరకాయ, చిక్కుడు, కాకరకాయ, మిరపకాయలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ, తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సొరకాయ, తీగ చిక్కుడు, దొండకాయ ఉత్పత్తులు మాత్రం జనాభా అవసరాలకు సరిపడే స్థాయిలో రావడం లేదు. ఈ క్రమంలో తీగజాతి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రైతులు పండించిన కూరగాయలను జిల్లాలోని మార్కెట్లలో విక్రయించడంతోపాటు హైదరాబాద్కు తరలించేందుకు రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. హన్వాడ మండలంలో ఇప్పటివరకు వరకు 22 మంది రైతులు పందిర్లు వేసుకున్నారు. ఈ పందిర్లపై చిక్కుడు, దొండ, కాకర, బీరకాయ, సొరకాయ, బీర్నీస్ వంటి వాటిని సాగు చేస్తున్నారు. పందిర్ల కింద టమాటా, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, మిరప సాగు చేస్తున్నారు. డ్రిప్ సిస్టంతో నీటిని అందిస్తున్నారు. డ్రిప్తో తక్కువ నీటితో అధిక దిగుబడి సాధిస్తున్నారు.
సబ్సిడీ వివరాలు..
శాశ్వత పందిరి పద్ధతిలో కూరగాయల సాగు ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఎకరాకు 100 రాతి కడ్డీలు, తీగలు ఏర్పాటు చేయాలి. అర ఎకరాకు రూ.1.08 లక్షల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తంలో సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉపాధి హామీ పథకంలో భాగంగా వస్తువులు, కూలీల ఖర్చు ఇవ్వనున్నది. ఐదెకరాలలోపు ఉన్న వారికి వందశాతం సబ్సిడీతో రైతు ఖాతాలో రూ.లక్ష జమ చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్ను ఇస్తున్నది. గ్రామాల్లో చాలా మందికి అవగాహన లేకపోవడంతో శాశ్వత పందిరికి దరఖాస్తు చేసుకోవడం లేదు.
ప్రయోజనాలు..