వనపర్తి : రంజాన్ పండుగను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈద్గా మజీద్ ప్రాంగణంలో ముస్లిం సోదరులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ప్రభుత్వ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.