పరిగి, మార్చి 18 : ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శివభక్త సిరియాల వీధి నాటకం అయిదవ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాచీన కళలను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. వీధినాటకాలను ప్రోత్సహించాలన్నారు.
అధునాతన యుగంలోను వీధినాటకాలకు చక్కటి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పాత్రధారులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, రాఘవాపూర్, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్లు నల్క జగన్, నిదురం రేణుక, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డి, గ్రామ టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.