పెద్దమందడి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని జగత్పల్లి గ్రామ శివారులోని ఎస్టీ గురకుల పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. మండలంలోని వీరాయపల్లి గ్రామంలో రైతుబంధు సమితి మండ లాధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి నివాసంలో ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను పంపిణీ చేశారు.
అనంతరం ఆయా గ్రామాల ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మద్యన ఉండి సేవలందిస్తామన్నారు. మారుతున్న సమాజంలో జాగ్రత్తలు పాటిస్తు ఆరోగ్యా న్ని కాపాడుకోవాలన్నారు. 67 సంవత్స రంలోని పాలనలో చేయ్యలేని పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
నిరుపేద కుటుంబంలోని ఆడపడుచుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశా రు. అదేవిధంగా రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అనేక పతకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లాతో పాటు మండ లాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణలతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతా లలోని మంచి వాతావరణం ఉండటానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారని, అదేవిధంగా వైకుంఠధామాల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించామ న్నారు. రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ తూడి మెగారెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, వనపర్తి మార్కెట్ చైర్మన్ లకా్ష్మరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సత్యారెడ్డి, మాజీ ఎంపీపీ మన్యపురెడ్డి, టీఆ ర్ఎస్ అధ్యక్షుడు వేణుయాదవ్, సింగిల్విండో ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.