వనపర్తి: జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల కోసం వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెంగా, పలువురు గాయపడ్డారు. ఓ ఆటో ట్రాలీ కూరగాయలు కొనుగోలు చేయడానికి కొత్తకోట నుంచి కర్నూలుకు వెళ్తున్నది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కొత్తకోట మండలంలోని నాటవెళ్లి వద్ద 44వ జాతీయ రహదారిపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వంగూరి శ్రీనివాసులు (40)గా గుర్తించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.