ఊట్కూర్, అక్టోబర్ 9: నారాయణపేట జిల్లా వ్యా ప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఊట్కూర్ పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. సంగంబండ రిజర్వాయర్కు భారీగా వరద చేరడంతో మల్లేపల్లి గ్రామానికి రాకపోక లు నిలిచిపోయాయి. గ్రామ శివారులో నిర్మించిన వై కుంఠ ధామం, ప్రకృతి వనం చుట్టూ నీరు చేరింది. మా గనూర్లో అత్యధికంగా 98.0 మి.మీ. వర్షం కురిసింది.
ఈదురు గాలుల వర్షం
గద్వాల,అక్టోబర్ 9: జిల్లాలో రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో 62.3మిల్లీ మీటర్లు, ధరూర్ 46.7, గద్వాల 46.5, ఇటిక్యాల 41.7,మల్దకల్ 21.6, గట్టు 49.0, అయిజ 65.7, రాజోళి 53.5, వడ్డేపల్లి 46.1, మానవపాడ్ 71.6, ఉండవెల్లి 68.3, అలంపూర్లో 54.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 52.3మిల్లీ మీటర్లుగా నమోదైంది.
వెల్దండలో..
వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. బైరాపూర్ వాగు పొంగి పొర్లడంతో వంతెన దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెల్దండలో 9మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.