అహ్మదాబాద్ : గుజరాత్ అహ్మదాబాద్లో కృష్ణనగర్లోని అంకూర్ పాఠశాలలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు. మంటల్లో ఐదుగురు చిక్కుకోగా వారిని రక్షించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఉద్యోగులు, విద్యార్థులందరినీ భవనం నుంచి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు రావడంతో ఒక్కసారిగా భారీగా పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. చివరికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.