కొత్తకోట: కొత్తకోట మండలంలోని రాయినిపేట, పట్టణంలోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్ భాషా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కొవిడ్ బారిన పడకుండా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోని కోవిడ్ వైరస్న్ తరమి కొట్టాలన్నారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దన్నారు.
పట్టణంలోని 13,15వ వార్డులలో వ్యాక్సి న్ కేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందునాయక్, మున్సి పల్ చైర్పర్సన్ సుకేశిని, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు, మన్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజమైనూద్దిన్, రామ్మోహన్రెడ్డి, రాములుయాదవ్, రవీందర్రెడ్డి, అయ్యన్న, పద్మ, సంధ్య, కోఆప్షన్ సభ్యులు వసీం, వహిద్, మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, యాదయ్యసాగర్, మోహన్రెడ్డి పాల్గొన్నారు.